Andhra Pradesh:కొరకురాని కొయ్యిగా కొలికపూడి:నోరు మంచిదయితే ఊరు మంచిదవుతుంటారు. కానీ గతంలో ఎన్నడూ లేని విధంగా తిరువూరు టీడీపీ ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు వరస వివాదాల్లో చిక్కుకుంటున్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడి పది నెలలు కాకముందే వంద ఆరోపణలు ఆయన ఎదుర్కొన్నారు. అది కూడా ప్రత్యర్థుల నుంచి కాదు. సొంత పార్టీ నేతలు, కూటమి పార్టీల నాయకుల నుంచి ఆయన ఆరోపణలు ఎదుర్కొనడం టీడీపీ నాయకత్వానికి తలనొప్పిగా మారింది. ఇప్పటికే పలు మార్లు పంచాయతీ కొలికిపూడి వివాదాలపై చేయడం, క్రమశిక్షణ కమిటీ ముందు హాజరు కావడం వంటివి జరిగాయి.
కొరకురాని కొయ్యిగా కొలికపూడి
విజయవాడ, మార్చి 24
నోరు మంచిదయితే ఊరు మంచిదవుతుంటారు. కానీ గతంలో ఎన్నడూ లేని విధంగా తిరువూరు టీడీపీ ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు వరస వివాదాల్లో చిక్కుకుంటున్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడి పది నెలలు కాకముందే వంద ఆరోపణలు ఆయన ఎదుర్కొన్నారు. అది కూడా ప్రత్యర్థుల నుంచి కాదు. సొంత పార్టీ నేతలు, కూటమి పార్టీల నాయకుల నుంచి ఆయన ఆరోపణలు ఎదుర్కొనడం టీడీపీ నాయకత్వానికి తలనొప్పిగా మారింది. ఇప్పటికే పలు మార్లు పంచాయతీ కొలికిపూడి వివాదాలపై చేయడం, క్రమశిక్షణ కమిటీ ముందు హాజరు కావడం వంటివి జరిగాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పలు మార్లు హెచ్చరించినా కొలికపూడి శ్రీనివాసరావు వైఖరిలో మార్పు రావడం లేదు. వరస వివాదాల్లో చిక్కుకోవడంతో పాటు తానే నియోజకవర్గంలో మోనార్క్ లాగా వ్యవహరిస్తుండటంతో పార్టీ పెద్దలు కూడా ఏమీ చేయలేక, చర్యలు తీసుకోలేక చేతులెత్తేస్తున్నట్లే కనపడుతుంది. చాలా రోజుల తర్వాత తిరువూరు నియోజకవర్గంలో టీడీపీ విజయం సాధించింది.
అయితే ఆ విజయం సాధించామన్న ఆనందం మాత్రం పార్టీ నేతలు, శ్రేణుల్లో కొలికపూడి శ్రీనివాసరావు మిగల్చడం లేదు. ఎన్నికయిన నాటి నుంచి ప్రతిదీ వివాదమే. ప్రభుత్వ నిర్ణయాలను వ్యతిరేకిస్తూ ఆయన పోస్ట్ చేస్తున్న వీడియోలు కూడా వైరల్ గా మారడంతో పార్టీ పెద్దలు అక్షింతలు వేశారు. బెల్ట్ షాపులంటూ దాడులు ఎమ్మెల్యే కొలికపూడి స్వయంగా నిర్వహించడంతో పాటు రహదారులపై కూర్చుని నిరసన వ్యక్తం చేయడం వంటి వాటిపై పార్టీ నాయకత్వం విచారణకు ఆదేశించింది. అదే సమయంలో ఒక దళిత మహిళను అవమానించారంటూ ఆమె ఆత్మహత్యాయత్నం చేయబోవడంతో అది కాస్తా పార్టీకి ఇబ్బందికరంగా మారింది. తిరువూరు నుంచి టీడీపీలోని ఒక వర్గం వచ్చి నేరుగా చంద్రబాబు నాయుడును కలిసి కొలికపూడి శ్రీనివాసరావుపై ఫిర్యాదు చేయడం కూడా జరిగింది. అప్పుడే చంద్రబాబు నాయుడు కొలికపూడిని హెచ్చరించారు. అమరావతి రాజధాని కోసం జరిగిన ఉద్యమంలో కీలకంగా వ్యవహరించారన్న ఏకైక కారణంతోనే పార్టీ నేతలను పక్కన పెట్టి కొలికపూడి శ్రీనివాసరావుకు టిక్కెట్ ఇస్తే గెలిచిన తర్వాత తమకు ఇబ్బందిగా మారారంటున్నారు టీడీపీ నేతలు.
కొలికపూడి తన వైఖరిని మార్చుకోకపోతే పార్టీ నియోజకవర్గంలో తీవ్రంగా నష్ట పోతుందని కూడా వారు చెబుతున్నారు తాజాగా జనసేన పార్టీకి చెందిన తిరువూరు నేత ఒకరు కొలికపూడి శ్రీనివాసరావుపై ఫిర్యాదు చేశారు. తనను చంపేందుకు కొలికపూడి సుపారీ ఇచ్చారని కూడా జనసేన నేత ఆరోపణలు చేయడంతో పాటు కొలికపూడి శ్రీనివాసరావు అనేక అవినీతి పనులకు పాల్పడుతున్నారని, అనేక మంది నుంచి డబ్బులు వసూలు చేస్తున్నారని ఆయన ఆరోపించడం ఇప్పుడు కూటమికి ఇబ్బందికరంగా మారింది. స్థానిక టీడీపీ నాయకత్వంతో పడకపోవడం, కూటమి నేతలను కొలికపూడి కలుపుకుని పోకుండా తనకు ఇష్టమున్న వాళ్లకే పదవులు కట్టబెడుతుండటం వంటి కారణాలతోనే ఆయన వరస వివాదాల్లో చిక్కుకుంటున్నారని తెలిసింది. ఇప్పటికైనా కొలికపూడి శ్రీనివాసరావు తన వైఖరి మార్చుకోకుంటే తిరువూరులో పార్టీ మరింత ఇబ్బదుల్లో పడే అవకాశముందన్న హెచ్చరికలు వినిపిస్తున్నాయి.
Read also:జగన్ దారి ఎటూ..
కాకినాడ
వైఎస్ జగన్ రాజకీయంగా గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. ఏపీలో తన పార్టీ పరిస్థితి మాత్రమే కాదు. జాతీయ స్థాయిలో ఎలాంటి రాజకీయ నిర్ణయాలు తీసుకోవాలన్న దానిపై ఆయనకు స్పష్టత లేకుండా పోయింది. ఓ వైపు ఎన్డీఏ కూటమి కాదనేసింది. ఇండియా కూటమి రమ్మంటోంది. కానీ ాయన మాత్రం ధైర్యం చేయలేకపోతున్నారు.దక్షిణాదికి నియోజకవర్గాల పునర్విభజన విషయంలో అన్యాయం జరుగుతోందన్న వాదనతో నిర్వహించిన సమావేశానికి డీఎంకే నుంచి ప్రతినిధులు వచ్చి జగన్ ను కలిశారు. అప్పట్లో వారికి వస్తామా లేదా అన్న సమాచారం ఏమీ చెప్పలేదు. చివరికి వెళ్లలేదు. అయితే సన్నిహిత పార్టీగా గుర్తింపు ఉన్న బీఆర్ఎస్ పార్టీ కూడా ఈ సమావేశంలో పాల్గొంది. కేటీఆర్ హాజరయ్యారు.
కానీ జగన్ మాత్రం వెళ్లలేదు. స్టాలిన్ తో జగన్ కు మంచి సంబంధాలు ఉన్నాయి. 2019లో జగన్ ప్రమాణ స్వీకారానికి వచ్చిన ఇద్దరు ముఖ్యమంత్రుల్లో ఒకరు . అయినా స్టాలిన్ పిలుపునకు జగన్ స్పందించలేదు. కొద్ది నెలల కిందట జగన్మోహన్ రెడ్డి ఢిల్లీలో ధర్నా చేస్తే .. ఆయనకు మద్దతు ఇవ్వడానికి ఇండియా కూటమిలోని పార్టీల నేతలందరూ వచ్చారు. టీడీపీపై విమర్శలు చేశారు. కానీ జగన్ మాత్రం ఇండియా కూటమికి ఏ విషయంలోనూ మద్దతు ప్రకటించడానికి ధైర్యం చేయలేకపోతున్నారు. గతంలో పార్లమెంట్ లో ఏ విషయంలోనూ కాంగ్రెస్ కూటమిని సమర్థించలేదు సరి కదా ఇప్పుడు స్టాలిన్తో భేటీకి కూడా దూరంగా ఉన్నారు. దక్షిణాదికి అన్యాయం జరుగుతుందా లేదా అన్న అభిప్రాయాన్ని చెప్పడానికి కూడా భయపడుతున్నారన్న అభిప్రాయం వినిపిస్తోంది.
ఢిల్లీలో స్టాలిన్ సమావేశం జరుగుతున్న సమయంలో జగన్ ప్రధానికి ఓ లేఖ రాశారని వైసీపీ వర్గాలు మీడియాకు సమాచారం ఇచ్చాయి. వచ్చే ఏడాది (2026) జరగబోయే డీలిమిటేషన్ ప్రక్రియలో ఆయా రాష్ట్రాల సీట్ల విషయంలో అన్యాయం జరగకుండా చూడాలి. ప్రస్తుతం ఉన్న జనాభా లెక్కల ప్రకారం డీలిమినేషన్ చేస్తే దక్షిణాది రాష్ట్రాల భాగస్వామ్యం కచ్చితంగా తగ్గుతుంది. అందుకే జనాభా లెక్కల ప్రకారం ఈ డీలిమిటేషన్ లేకుండా చూడండి అని లేఖలో మోదీని కోరారు. సమావేశానికి వెళ్లకుండా.. బీజేపీని సంతృప్తి పరిచిన ఆయన మోదీకి లేఖ రాసి.. ఆ సమాచారాన్ని స్టాలిన్ కు పంపి.. వారినీ సంతృప్తి పరిచే ప్రయత్నం చేశారు. జగన్ తమ వైపే ఉన్నారని కనిమొళి కూడా ప్రకటించారు. అయితే రాజకీయాల్లో ఇలా రెండు పడవలపై చేసే ప్రయాణం మనకకే దారి తీస్తుందన్న అభిప్రాయాలు ఉన్నాయి. జగన్ ఏదో ఓ కూటమి వైపు మొగ్గితే మంచిదని అంటున్నారు. ఎన్డీఏతో కలిసే అవకాశాలే ఉండనప్పుడు బీజేపీ చల్లని చూపుల కోసం ప్రయత్నించడం రాజకీయంగా నష్టం జరుగుతుందని అంటున్నారు.
Read more:Andhra Pradesh:పోసాని తర్వాత విడదల రజనీ